నవపేట్ ఎస్ఐ పైన చర్య తీసుకోవాలి.
జనం న్యూస్ 10 జనవరి ( డిస్టిక్ రిపోర్టర్ ) నావపేట్ ఎస్ ఐ పైన చర్యలు తీసుకోవాలి లేనిపక్షంలో ఎస్సై పైన చర్య కొరకు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసి న్యాయ పోరాటాన్ని ప్రకటిస్తాం ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడెబ్లు )రాష్ట్ర కార్యదర్శి వై గీత.
ఈరోజు క్లబ్బు ఫంక్షన్ హాల్ లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పి.ఓ.డెబ్లు. రాష్ట్ర కార్యదర్శి వై గీత,ఏ.ఐ.డి.డెబ్లు ఏ..జిల్లా కార్యదర్శి అనసూయ,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి పి యాదగిరి,సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్ బి మల్లేష్, నాయకులు రాములు, పిడిఎస్యు జిల్లా నాయకులు గోపాల్, ప్రభాస్, గిరిజన సంఘం నాయకులు శ్రీనివాస్ నాయక్, అంబేద్కర్ సంఘం నాయకులు ఆనంద్, తదితరులు మాట్లాడుతూ నవపేట పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన పట్ల జిల్లా ఎస్పీ స్పందించి సమగ్రమైన విచారణ జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని పేదలు మహిళలు పోలీస్ స్టేషన్కు పోవాలంటే విశ్వాసం కలిగేలాగా నమ్మకం కల్పించాలని అన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్స్
1. వరమ్మకు న్యాయం చేయాలి.
2. ప్రత్యర్థుల నుండి ఆమెకు రక్షణ కల్పించాలి.
3. నవపేట్ ఎస్సై పైన చర్య తీసుకోవాలి.
పై విషయాల పట్ల వారం రోజుల్లో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని లేని పక్షాన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో న్యాయ పోరాటాన్ని ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్, నవీన్ కుమార్, లక్ష్మయ్య, యాదయ్య పాల్గొన్నారు.