
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 24 03. 2026
ఏప్రిల్ 1 నుంచి PAN కార్డు వినియోగంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా, ఉపసంహరించుకున్నా పాన్ వివరాలు ఇక పై ఇవ్వాల్సి ఉంటుంది. ఇళ్లు, స్థలాల కొనుగోలు, అమ్మకం, బహుమతి లేదా ఉమ్మడి డెవలప్మెంట్ ఒప్పందాల విషయంలో లావాదేవీ విలువ రూ.20లక్షలు దాటితే ఇకపై పాన్ తప్పనిసరి. ఏ మోటారు వాహనమైనా, దాని ధర రూ. 5 లక్షలు మించితే కొనుగోలుదారుడు పాన్ సమర్పించాలి….