
జనం న్యూస్ మార్చి 27 తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భక్తి పరవశం వెల్లివిరిసింది. పాపిరెడ్డి నగర్లోని శ్రీ శ్రీ శ్రీ వీరాంజనేయ శివాలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు శేరిలింగంపల్లి శాసన సభ్యులు, పిఏసి చైర్మన్ అరెకేపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు, పాపిరెడ్డి నగర్ కాంటెస్టెడ్ అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి గాంధీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గాంధీకి శాలువాతో సన్మానం చేసి గౌరవించారు.వేడుకల సందర్భంగా మాట్లాడిన అరెకేపూడి గాంధీ, శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కల్యాణోత్సవాన్ని వీక్షించారు. ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
