
మద్నూర్ మార్చి 31 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కేంద్రంలోని మంగళవారం రైతు వేదిక నందు జుక్కల్ (SC) ఎస్సీ అసెంబ్లీ నియోజక వర్గం లోని తహసీల్దార్, మాస్టర్ ట్రైనర్ లకు మరియు బూత్ లెవెల్ అధికారుల సూపర్ వైజర్లకు , ఆపరేటర్స్ లకు( SIR )ఎస్ ఐ ఆర్ పై ఒక రోజు శిక్షణా నిర్వహించినట్లు మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ గారు తెలిపారు. ఈ కార్యక్రమం లో తహశీల్దార్లు ప్రవీణ్, వేణు గోపాల్, మహేందర్, మారుతి, భుజంగ రావు, హేమలత, సత్యనారాయణ రవి కాంత్, తదితరులు పాల్గొన్నారు.

