
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 6 సెల్ 9550978955
ఈరోజు (సోమవారం -06.04.2026) పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపిఎస్ PGRS లో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 59 ఫిర్యాదులను ప్రజలు పోలీస్ అధికారులకు అందజేయగా,వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించే పోలీస్ అధికారులకు వాటిని రిఫర్ చేయడం జరిగింది.PGRS లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించి,క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేసి, చట్ట ప్రకారం వారికి న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. దుర్గి గ్రామానికి చెందిన ఫిర్యాదుకు దుర్గి గ్రామ శివారులో అన్నదమ్ముల భాగాల క్రింద వాటాలు పంచుకొనగా ఫిర్యాదికి 70 సెంట్లు స్థలము వచ్చినట్లు, అందులో 10 సెంట్లు స్థలము దుర్గి గ్రామానికి చెందిన మరొక వ్యక్తి దొంగ కాగితాలు సృష్టించి ఆ 10 సెంట్ల భూమి నాది అని బెదిరిస్తూ ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిప్పుతూ, వేరే వ్యక్తులకు మద్యం తాగించి ఫిర్యాది ఇంట్లో మహిళలు ఉన్న సమయంలో వారితో దుర్భాషలు మాట్లాడి ఇబ్బంది పెడుతున్నట్లు, ఈ విషయంలో గౌరవ మాచర్ల కోర్టు వారి తీర్పు ప్రకారం ఫిర్యాది దావా గెలిచినప్పటికీ ఫిర్యాదిని వేరే వ్యక్తులతో కొట్టించాలి అనే ఆలోచన ఉన్నందున సదరు వ్యక్తి పై చట్టరీత్యా చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా ఫిర్యాది ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయటం జరిగింది.దుర్గి మండలం నరమాలపాడు గ్రామానికి చెందిన ఫిర్యాది "హౌసింగ్ ఫైనాన్స్ అల్ట్రా కంపెనీ"గుంటూరు వారి వద్ద నుండి ఇంటి రుణం కొరకు 2025 వ సంవత్సరంలో 5,50,000/- రూపాయలు అప్పుగా ఇంటి డాక్యుమెంట్స్ పెట్టినట్లు, ఫిర్యాదు వద్దనుండి ఇంటి కాగితాలు, ఖాళీ బ్యాంక్ చెక్ లు,ATM కార్డు ఫిర్యాది దగ్గర నుంచి సదరు ఫైనాన్స్ కంపెనీ కు మరియు నాకు మధ్యవర్తిగా ఉన్న అతను తీసుకున్నట్లు, 5,50,000/- రూపాయలు రుణం మంజూరు కాగా 3,00,000/- రూపాయలు మాత్రమే ఇచ్చి మిగిలిన 2,50,000/- రూపాయలు ఇవ్వకుండా మధ్యవర్తి తన వద్దనే ఉంచుకున్నట్లు, అదేమని అడిగితే రిజిస్టర్ ఖర్చు, కమిషన్ చార్జీలు అయినాయి అని అంటున్నట్లు, ప్రతి నెల 10,053/- రూపాయలు EMI హౌసింగ్ ఫైనాన్స్ అల్ట్రా కంపెనీ వారికి చెల్లిస్తున్నట్లు, కావున మిగిలిన డబ్బులు ఇవ్వమని సదరు మధ్యవర్తిని అడుగగా మీకు దిక్కు ఉన్నచోట చెప్పుకో అని అంటున్నట్లు, కావున ఫిర్యాదుని మోసం చేసిన సదరు వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా ఫిర్యాది శ్రీ ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెందిన ఫిర్యాది కు ఐదు సంవత్సరాల క్రితం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసినట్లు,అయితే గత ఏప్రిల్ నెలలో వారికి పాప పుట్టినట్లు అయితే ఫిర్యాదు భర్త పాప కడుపులో ఉండగా వదిలి పెట్టి వెళ్ళిపోయినట్లు, ఫిర్యాది తల్లిదండ్రులకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం కాగా నీకూ ఆడ పిల్లలు పుడతారు ఆమెను వదిలేసి రా అని అత్తమామలు చెప్పగా ఫిర్యాదు భర్త వదిలి వెళ్ళిపోయినందుకు గాను తగిన న్యాయం చేయవలసిందిగా శ్రీ ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.ఫిర్యాదు సత్తెనపల్లి పట్టణంలో కులవృత్తి చేసుకొని జీవిస్తున్నట్లు, సుమారు ఒకటిన్నర సంవత్సరం క్రితం ఫిర్యాది వారి నాన్నగారి పేరిట కుస్తీ 4,243/-రూపాయల చొప్పున 36 నెలలలో ఫైనాన్స్ తీరేలాగా టీవీఎస్ ఫైనాన్స్ ద్వారా సత్తెనపల్లి టౌన్ లోని ఆటోమొబైల్ షోరూంలో రైడర్ బైక్ ను తీసుకుని కిస్తీలు కడుతున్నట్లు, అలాగే ఫిర్యాది స్నేహితుని పేరుతో బజాజ్ ఫైనాన్స్ నందు పర్సనల్ లోను తీసుకొని ఇప్పటికీ 18 కిస్తీలు క్లియర్ చేసినట్లు రెండు కిస్తీలు పెండింగ్ లో ఉన్నవని ది.20.01.2025 వ తేదీన బజాజ్ ఫైనాన్స్ ఏజెంట్స్ ఇంకా కొంతమంది కలిసి రాత్రి 10 గంటల సమయంలో ఫిర్యాదు ఇంటికి వచ్చి రెండు కిస్తీలు కట్టమని లేకపోతే రైడర్ ను తీసుకుని వెళ్తామని మీ ఆది మీద గొడవ పడుతుండగా పక్క వాళ్ళు వచ్చి ఇది వేరే ఫైనాన్స్ బైకు అంటున్నాడు గా మీరు రెండు కిస్తీలకు ఈ బైక్ ను ఎలా తీసుకుని వెళ్తారు అని అడగగా వారి పైన కూడా గొడవపడి రైడర్ బైక్ను బలవంతంగా దౌర్జన్యం చేసి ఫిర్యాదు వద్ద నుండి లాక్కొని వెళ్లినట్లు, 31.03.2025 వ తేదీన 13,000/- రూపాయలు బజాజ్ ఫైనాన్స్ ఏజెంట్ చెప్పిన విధంగా ఒక వ్యక్తికి ఫోన్ పే చేసినట్లు అయినప్పటికీ బైకును ఇదిగో తెప్పిస్తాను అదిగో తెప్పిస్తాను అని ఇప్పుడు నీవు 10 రూపాయలు వడ్డీతో మొత్తం పే చేస్తేనే తెప్పిస్తామని లేదంటే నీ దిక్కున చోట చెప్పుకొని బెదిరిస్తున్నందుకు గాను చట్టరీత్యా చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా ఫిర్యాది శ్రీ ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.PGRS లో తమ సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలకు వాటిని రాసి పెట్టడం లో సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.