
జనం న్యూస్ ఏప్రిల్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
స్థానికంగా జరిగిన ఎన్ఆర్ఐ వధూవరుల వివాహ వేడుకలు స్నేహితులు, బంధువుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
తన మిత్రుడు గరికపాటి వేణు ప్రసాద్, అరుణ కుమారి దంపతుల కనిష్ట పుత్రిక యామిని వివాహం కిరణ్తో జరగగా, ఈ సందర్భంగా పురంధర్ రెడ్డి వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త జీవితం ఆరంభిస్తున్న ఈ జంట సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో నిండిన జీవితం గడపాలని, అష్ట ఐశ్వర్యాలతో ఎల్లప్పుడూ కలకాలం ఆనందంగా ఉండాలని భగవంతుని ఆశీస్సులు వారికి లభించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు జి. ప్రసాద్, శ్రీధర్, సూర్యనారాయణ, కుమార్, సురేష్, రమేష్, మోహన్ రావు తదితరులు పాల్గొని వధూవరులను అభినందించారు. అతిథులందరూ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి భవిష్యత్తు బాగా ఉండాలని కోరుకున్నారు.