
అంబేద్కర్ విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి,జాతీయ అంబెడ్కర్ అవార్డ్- మంచనపల్లి శ్రీనివాస్
జనం న్యూస్ 13 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా
ఈ భరత దేశంలో అన్ని వర్గాలకు హక్కులు కలిపించిన మహనీయులు ,రాజ్యాంగ నిర్మాత తన సర్వస్వ ని త్యాగం చేసి ఈ దేశం సర్వతోముఖాభిహృది కోసం పాటుపడిన మహనీయులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ,తను 1891 ఏప్రిల్ 14 నాడు జన్మిచడం జరిగింది.తను చిన్న తనములో ఎన్నో వివక్షలు ఎదురుకున్నాడు.తనకు అవకాశాలు లేని సమయంలో ఉన్నతమైన చదువులు చదవడం ద్వారా రాజ్యాంగ రచన కమిటీ 1947 ,ఆగస్ట్ 27 న రాజ్యాగం రచన కమిటీ చైర్మన్ గా నియమించారు.కావున నేటి యూవతరంకు ప్రభుత్వలు అన్ని అవకాశాలు కలిపించిన ప్రయోజకులు కాలేకపోతున్నారు,కావున అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని ,అతనిని ఆదర్శంగా తీసుకొని యూవత ముందుకు పోవాలని,అతని రచనలు మొట్టమొదటి గ్రంధం ది ప్రాబ్లమ్ అప్ రూపీస్ ఈ భారత దేశ ఆర్థిక వ్యవస్థను ఇప్పటి వరకు నడిపిస్తున్న గ్రంధం,అదేవిధంగా దళితులకు త్రాగడానికి నీరు ఇవ్వని ఈ సమాజంపైన పోరాటం మహాద్ చెరువు పోరాటం 1920 నుండి మను ధర్మ శాస్త్రం దహనం 1927 డిసెంబర్ ఆరు వరకు అతడి పోరాటం,అదేవిధంగా కులనిర్మూలన మీద ద అనిహిలేషన్ అప్ కాస్ట్ ఈభారత దేశంలో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు అతడు ఈ దేశంలో అందరితో పాటు మాకు హక్కుల కావాలని మేము ఆర్ధిక,సామాజిక,రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం కావాలని,*లండన్ లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 89 మందిలో దళిత వర్గాలనుండి అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్(1930-32) సమావేశంలో పాల్గొని ,అందరిని ఒప్పిచి,కమ్యూనల్ అవార్డ్ 15 పైన డిమాండ్స్ సాదించడం,1935 అక్టోబర్ పడముడున జరిగిన యవలన్ సమావేశంలో నేను నా ప్రమేయం లేకుండానే హిందు కులంలో పుట్టాను కానీ నా చావు మాత్రం హిందు కులంలో జరుపొద్దు,1954 లో బౌద్ధమతం స్వీకరించడం అని ఎందుకు అన్నాడో ,స్వాతంత్ర్య పోరాటంలో అంబేద్కర్ గారి పాత్ర గురించి,అదేవిధంగా,కమ్మునల్ అవార్డ్ *గాంధి గారు 1932 సెప్టెంబర్ 20 నా ఎర్రవాడ జెల్ లో ఆమరణ నిరాహారదీక్ష,సందర్భంగా పూణే ఒప్పదం గురించిన మేము(శూద్రులు SC,ST,BC,..) హిందువులం కాము అని లాండన్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో లో ఎందుకు అన్నారు రాజ్యగా రచన కమిటీ సమావేశాలు 1946 డిసెంబర్ 9 నా పరంభంమైతే అంబేద్కర్ గారికి డిసెంబర్ 17 నా మాట్లాడడానికి అవకాశం మొట్టమొదటి సారి వస్తే పది గంటలు ఈ దేశంలో ఉన్న ప్రతి సమస్యను పృశిస్తూ,రాజ్యం,రాజ్యాంగ,విధులు,హక్కులు,దేశ విభజన ,కులనిర్మూలన,మహిళలకు ప్రాతినిధ్యం,తదితర అంశాలు ,సమస్యలు మరియు పరిష్కార మార్గల గురించి మాట్లాడితే సభలో ఉన్న 290 పైన ఉన్న సభ్యులు అందరినీ ఒప్పిచిన మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్,ఈ సందర్భంగా నెహ్రూ గారు స్పందించి మేమంతా మేట్రిక్ లేషన్ విద్యార్థులు లాగ ఏమి మాట్లాడలేకపోయము అన్న సందర్భం, తరువాత అంబేద్కర్ గారిని రాజ్యగా రచన కమిటీలలో లేకుండ రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో మాను వాద నాయకులు ఓడించడం ,అప్పటి తూర్పుబెంగాల్ నుండి ఎన్నికైన షెడ్యుల్డ్ కాస్ట్ ఫెడరేషన్ నాయకులు జోగేంద్రనాద్ మండల్ రాజీనామా,అంబేద్కర్ ఎన్నిక,మరియు అప్పుడే ఇట్టి ప్రతాన్ని పాకిస్తాన్ లో కలపడం,ఈ విధంగా ఎన్నో సంఘటనల మధ్య
1947 ఆగస్టు 27 బాబు రాజేంద్రప్రసాద్,మరియు నేహు, అందరూ కలసి రాజ్యగా రచన కమిటీలో ఏడూ గురితో ఏర్పాటు చెయ్యడం,రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ గా నియమిచడం,వారు ఇట్టి రాజ్యాగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజు రచించడం
ఈ దేశంలో అన్ని వర్గాల మహిళలకు హక్కులు,అన్ని రంగాలో అవకాశాలు కలిపించాలని ప్రభుత్వలను కోరడం,వారు ఒప్పుకోకపోవడం రాజీనామా చెయ్యడం,
మహిళ హిందు కోడ్ బిల్లు కోసం తన న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా.
వివిధ దేశాలలో,సమావేశాల్లో పాల్గొని ముందుకు వెళ్లడం,ఈసందర్భంగా జరిగిన సంఘటనలు.చివరి క్షణం వరకు భారత దేశం,మరియు ప్రజాస్వామ్యం కోసం ,హక్కుల సాధనాకోసం పోరాటాలు చేస్తు,1956 మార్చి ఆరు నాడు మరణించడం జరిగింది.ఈదేశం జరిగిన పలు విషయాలు ఇంత శ్రమతో మరియు భారత దేశంలో అత్యధిక చదువులు చదివిన మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారు.వీరి పుట్టినరోజు ను ఐక్యరాజ్య సమితి వరల్డ్ నాలెడ్జ్ డే గా ప్రకటించింది కావున విద్యార్థులు,విద్యావెతలు,యూవజన సంఘాల నాయకులు,ప్రజా ప్రతినిధులు,ప్రతి ఒక్కరు అంబేద్కర్ చేసిన పోరాటాలు,వారి రచాలను చదివి వాటిలో నుండి సమాజానికి,దేశానికి,ప్రతీ ఒక్కరికీ సమన్యాయం జరుగలని,వారి రచనలు చదవాలని,అంబేడ్కర్ అంటే కేవలం రిజర్వేషన్లు,రాజ్యాగం,కాదని ఈ భారత దేశంలో ఉన్న ప్రతి సమస్యకు పరిస్కరం అంబేడ్కర్ ఐడియాలజీ అని ఇందు కోసం ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని .అంబేద్కర్ అంటే దళితులకు మాత్రమే నాయకులు కాదు ప్రతి ఒక్కరి నాయకులుగా చెయ్యాలని కోరుతూ మీ మంచనపల్లి శ్రీనివాస్,జాతీయఅంబేడ్కర్ అవార్డ్,ఉపాధ్యాయులు,PRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు,అంబేడ్కర్ విజ్ఞాన వేదిక