
జనం న్యూస్ 23 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం తప్పట్లమరుసు దళితుల మీద అణచివేసే వ్యక్తులకు ఖబర్దార్ మీ అంతుచూస్తాం. భీమ్ ఆర్మీ ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, తప్పెట్ల మరుసు గ్రామంలో నిరుపేద మాదిగ కులానికి చెందిన జయంత్ వారి తండ్రి మీద దాడి చేసిన నలుగురు ఇడిగ కులస్తుల మీద కఠిన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్ డిమాండ్ చేశారు నిన్న తపెట్ల మరుసు గ్రామంలో మా పొలంలో టిప్పర్లు ఎందుకు వెళ్తున్నాయి అని జయంతు వారి తండ్రి ఇడిగా కులానికి చెందిన నాగన్న గౌడ్,శంకర్ గౌడ్, కొండన్న గౌడ్ బలరాం గౌడ్ రామాంజనేయులు గౌడ్ లను ప్రశ్నించినందుకు వారు కోపోద్రికులై మాదిగ కొడకల్లారా అని కులంపేరు దూషించి దాడి చేయడం జరిగింది . ఈరోజు గట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ నుండి డిమాండ్ చేశారు తపెట్లమరుసు గ్రామంలో దళితులను ఇడిగ కులానికి చెందిన కొంతమంది అణచివేస్తూ కులవివక్షతో వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, మొన్నటికి మొన్ననే ఒక దళితుడు చనిపోతే శవాన్ని తీసుకు వెళుతుండగా కొంతమంది ఈడుగా కులస్తులు అడ్డుకొని మాకు గుంతలు తీయాలని వీరిని భయభ్రాంతులకు గురి చేస్తూ శవాన్ని పూడ్చనివ్వకుండగా అడ్డుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన సంఘటన కూడా మొన్ననే చూసాము ఇట్టి దుర్మార్గాలు కొంతమంది ఈడిగ కులానికి చెందిన వ్యక్తులు చేస్తున్నారు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం దళితుల మీద దాడి చేసే వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ, రాష్ట్ర డీజీపీ భీమ్ ఆర్మీ మాచర్ల ప్రకాష్ డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేశారుకార్యక్రమం లో బాధితులు జయంత్, వారి తండ్రి, మరియు తపెట్లమరుసు గ్రామ ప్రజలు