జనం న్యూస్ ఫిబ్రవరి 17: నిజామాబాదు జిల్లా ఏర్గట్ల మండలంలో నిబట్టాపూర్ గ్రామంలో స్థానిక యువకులు ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రీకెట్ టోర్నమెంట్ ను స్థానిక యువకుడు దయానంద్ నాయక్ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఏర్పాటు చేసినయువకులు మాట్లాడుతూ.. క్రీకెట్ టోర్నమెంట్లో పాల్గొనే జట్లు ఆధార్ కార్డుతోపాటు ఒక వేయి రూపాయలు చెల్లించి జట్టు పేరునమోదు చేసుకోవాలని మాట్లాడారు . గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి గాపదివేల రూపాయలు,ద్వితీయ బహుమతి ఐదువేలు మరియుకప్పు ఇ వ్వడం జరుగుతుంది అని తెలిపారు.ఆసక్తి గల క్రీకెట్ క్రీడాకారులు నరేందర్ యాదవ్ 8185035654, అజీమ్ 8179523239, పవన్ గౌడ్ 7036737505, ఫోన్ నంబర్లకు సంప్రదించాలనీ తెలిపారు. ఈ కార్యాక్రమం లో ప్రవీణ్ యాదవ్, నరేందర్ యాదవ్,వర్షిత్ గౌడ్, సతీష్ గౌడ్, మారుతీ, ఆదర్శ్, సాయి, పలు గ్రామాల నుండి వచ్చిన క్రీకెట్ టీ ల క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు