జనం న్యూస్ ఫిబ్రవరి 17 భక్తుల హరి నామ సంకీర్తన లతో తడిసి ముద్దయ్యాయి జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ప్రముఖ పూణ్యకేత్రం మైన గుట్టా పై వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీలక ఘట్టమైన రథోత్సవం కార్యక్రమం కన్నుల పండుగగా సోమవారం సాయంత్రం లక్షలాది మంది భక్తజనం మద్య కన్నుల పండుగగా సాగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి భక్తులు తరలిరావడంతో శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ గుట్టలు గుట్టలు నరసింహుని నామస్మరంతో మారుమోగింది ఉదయం నుంచి భక్తుల తాకిడితో క్యూ లైన్లు లో బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ భక్తుల రద్దీతో చిన్న పిల్లలు వృద్దులు స్వామీ వారి దర్శనానికి అవస్తలు పడవలసి వచ్చింది . ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి పల్లకిలో గరుడవాహనంపై కుర్ఛోపెట్టుకొని బోయీలు నెత్తిన ఏంతో కోగా భజభజంత్రీల మద్య గుట్టా పై నుంచి గుట్టా కిందకి దిగారు అనంతరం రథం ముందు హోమం బలిహరణం తో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వివిధ పూలతో అలంకరించి రథం పై స్వామి వారు సతీసమేతంగా అసినులయ్యారు దీంతో రథోత్సవానికి తరలివచ్చిన భక్తజనం మంద్య రథాన్ని లాగుతూ నృసింహుని నామస్మరణతో మారుమోగగా స్వామి వారు రథం పై తిరిగారు శివాసత్తుల పూనకాలు దీటి మొక్కులు రథం కు ఎదురుగా భక్తులు తన్మయత్వంతో ఊగిపోతుండుడం అలరించింది జగిత్యాల కు చెందిన రిటైర్మెంట్ పోలీసులు అధికారి మల్లయ్య వేషధారణ భక్తుల ను ఆకట్టుకుంది ఆలయ అర్చకులు సంతోషార్యులు మదుకుమార్ చార్యులు చిన్న సంతోష్ చార్యులు కార్యనిర్వహణాధికారి సంకుటాల శ్రీనివాస్ మాజీ ఎంపిపి మసర్తి రమేష్ మాజీ జడ్పీ టిసి సభ్యురాలు పాథ పద్మ రమేష్ మాజీ వైఎస్ ఎంపిపి బి లక్ష్మన్ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చేర్పురి సుభాష్ యాదవ్ కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాల రాంచందర్ రావు కొల్ముల రమణ మాజీ సర్పంచ్ గర్సకుర్థి శిల్ప రమేష్ ఆలయ మాజీ ఆలయ చైర్మన్ లు ఎనగంటి సాగర్ గౌడ్ సుమన్ రమణా రావు గోడుగు కేశవులు వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోలిస్ వారి అధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పోలిస్ లు బారి బందోబస్తు నిర్వహించారు