మూడు సంవత్సరాలు జైలు శిక్ష 9 వేల రూపాయల జరిమానా
జనం న్యూస్ పీబ్రవరి 18: ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం ఆసిఫాబాద్ జిల్లా చింతల మనేపల్లి మండలానికి చెందిన వికలాంగురాలిపై అత్యాచార యత్నం చేసిన కామెర శంకర్ కు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్ట్ న్యాయమూర్తి యువరాజు తీర్పు ఇచ్చారు.కౌటల సిఐ ముత్యం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.చింతలమానపల్లి మండలం చెందిన వికలాంగురాలు పై 18/04/2023 న ఉదయం 3 గం. ల సమయం లో , అదే గ్రామానికి చెందిన కామెర శంకర్ (వయస్సు 40 సం.) అత్యాచార యత్నం చేయబోగా, ఆమె వెంటనే బిగ్గరగా కేకలు వేయగా నిందితుడు వెంటనే పరుగులు తీశాడు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు నిందితుడు శంకర్ అని గుర్తుపట్టారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే గ్రామంలో తమ పరువు పోతుందని అనుకొని , కుటుంబ సభ్యులు మరల విచారించుకొని , ఆ మరునాడు అనగా 19/04/2023 న పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో శంకర్ కు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు 9000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున పి పి జీవీఎస్ ప్రసాద్ వాదించారు. నిందితుడికి శిక్ష పడటంలో కృషిచేసిన కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ రాంసింగ్ ఎ.ఎస్.ఐ, సి.డి.ఓ బాలాజీ ఏ.ఎస్.ఐ లను ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ అభినందించారు.