జనం న్యూస్ ఫిబ్రవరి 20: కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి రేఖా గుప్తా మరో పేరు రేఖా రాణి ఆమె ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేపు మధ్యాహ్నం ప్రమాణం చేయబోతోంది ఆమె పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది.
సీఎం పోస్టుకు వ్యూహంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. యాభై ఏళ్ల వయస్సున్న ఆమె తొలిసారి ఎమ్మెల్యే షాలిమార్ బాగ్ నుంచి ఎన్నికైంది మొన్నటి ఎన్నికల్లో అంతకుముందు రాజకీయ అనుభవం లేదా అంటే ఉంది ఆమె పొలిటికల్ కెరీర్ విద్యార్థి రాజకీయాల నుంచి ప్రారంభమైంది. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రెటరీగా,అధ్యక్షురాలిగా కూడా చేసింది ఏబీవీపీ ఫుల్ టైమ్ కార్యకర్త.న్యాయవిద్య చదువుకుంది తరువాత ఢిల్లీలో రెండు సార్లు కౌన్సిలర్ తరువాత మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు పార్టీ ఢిల్లీ విభాగం ప్రధాన కార్యదర్శి కూడా ఒకసారి ఢిల్లీ మేయర్ అభ్యర్థిగానూ పోటీపడింది ఇప్పుడు ఈమె ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి గతంలో షీలా దీక్షిత్, సుష్మాస్వరాజ్, అతిషి ఇప్పుడు రేఖా గుప్తా బీజేపీ తరఫున రెండో మహిళా ముఖ్యమంత్రి స్వస్థలం హర్యానాలోని జింద్ జిల్లా, జులానా సబ్ డివిజన్ నందిగఢ్ ఊరు తండ్రి జైై భగవాన్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ తను ఢిల్లీకి బదిలీ కాగా, కుటుంబం మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అయ్యింది ఆ కుటుంబానిది రాజకీయ కుటుంబం కాదు ఆమె కుటుంబసభ్యులు జులానాలో ధాన్యం మార్కెట్లో చిన్న వ్యాపారం. అడితీదార్లు భర్త మనీష్ గుప్తా ఢిల్లీలోనే స్పేర్ పార్ట్స్ వ్యాపారం తను రాజకీయాల్లో లేడు భార్యకు బలమైన మద్దతుదారు కుమార్తె హర్షిత కూడా తండ్రికి వ్యాపారంలో సాయం చేస్తుంటుంది ఇదీ ఆమె కుటుంబ నేపథ్యం