జనం న్యూస్- ఫిబ్రవరి 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు జె సుప్లవి రాజ్, ఎస్కే రిజ్వానాలు ఉత్తరాఖండ్ లో ఈనెల 3 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగిన నెట్ బాల్ 38వ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్స్ సాధించారని నల్లగొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ కిరణ్ కుమార్ తెలిపారు, నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) లో మెడల్స్ సాధించిన విద్యార్థులను సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ లలిత, సిస్టర్ మతీన, పాఠశాల పిఈటి కిరణ్ కుమార్, ఇతర ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు