జనంన్యూస్. 05. నిజామాబాదు. సిరికొండ. సిరికొండ.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై మార్చి 4 నుండి 10 తేదీ వరకు అన్ని గ్రామ మండల జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ ప్రదర్శనలు చేయాలనే మందకృష్ణ మాదిగ. పిలుపు లో బాగంగా ఈరోజు ఎమ్మార్పీఎస్.మండల విశ్రుత స్థాయి సమావేశం. సిరికొండ, మండల అధ్యక్షుడు మొట్టల దీపక్. ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్, ఇంజం వెంకట స్వామి.మాట్లాడుతూ మనకు రావలసిన ఏబీసీడీ వర్గీకరణ లో అన్యాయం జరిగింది 11 శాతం రావాల్సింది 9. శాతం తో సరిపెట్టినారు జనాభా నిష్పత్తి ప్రాకారం చుసిన మనకు 11 రావలిసిందిగా జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో లోపాలను సవరించి అందరికి న్యాయం జరిగేలా చూడాలని దానిలో భాగంగానే మర్చి. 4 నుండి 10 వరకు మండలం లో డప్పు ల ప్రదర్శన చేయాలని మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపుమెరా అన్ని మండలాల్లో డప్పు ల ప్రదర్శన నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులుమాజీ ఉమ్మడిజిల్లాల ఇంచార్జ్ గందమాల నాగభూషణం మాదిగ . జాతీయ మహిళా నాయకురాలు యమున, జిల్లా ప్రధాన కార్యదర్శి. పిప్పర సంజీవ్. ఎమ్మార్పీఎస్ ధర్పల్లి మండల ఇంచార్జ్. నక్క రాజేందర్, సీనియర్ నాయకులు, డప్పు నర్సయ్య, సంగేమ్ కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు