
జనం న్యూస్ 14 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మల్దకల్ మండల కేంద్రంలో మొక్కజొన్న సీసీ కేంద్రాన్ని సందర్శించి, పరిశీలించిన భారత కమ్యూనిస్టు పార్టీ, జోగులాంబ గద్వాల జిల్లా సమితి సభ్యుడు కామ్రేడ్ రంగన్న ఎల్కూర్ ధాన్యాన్ని తూకం చేయడానికి మొక్కజొన్న సీసీ కేంద్రాలలో కొత్త కాంటాలను ఏర్పాటు చేయాలి ధాన్యాన్ని కొనడంలో జాప్యం వహించడం తగదు 20 రోజులు గడిచిన దాన్యం కొనని ప్రభుత్వం సిగ్గుచేటు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయాలి వెంటనే వారి ఖాతాలలో నగదును జమ చేయాలి రైతులు పండించిన పంటను కొనడంలో వారి ఖాతాలో నగదును జమ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే రైతులు వ్యవసాయం చేయడానికి కూడా నిర్లక్ష్యం చేస్తారు ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులు రైతులకు వెన్నంటుగా ఉండి వారికి తగిన సహాయ సహకారాలు సూచనలు ఇస్తూ వారు పండించిన పంటకు సరైన మద్దతు ధర ప్రకటిస్తా ఉంటే రైతులు కూడా వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతారు ఈ సందర్భంగా మల్దకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న సీసీ కేంద్రాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు సందర్శించి పరిశీలించి రైతుల కష్టనష్టాలను తెలుసుకోవడం జరిగింది. రోజులు గడిచిన ధాన్యం కొనడం లేదని రైతులు వాపోతున్నారు. రోజులు గడిచిన మా ఖాతాలలో నగదును జమ చేయడం లేదని వాపోతున్నారు. మరలా రేపు జూన్ నెల నుంచి కొత్త పంటలు పండించడానికి మాకు పెట్టుబడులకు డబ్బులు లేని పరిస్థితి, ఈరోజు మేము పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని కొని,మా ఖాతాలలో నగదును జమ చేస్తే ఆ డబ్బులతో మరల కొత్తగా వ్యవసాయం చేయడానికి పనిముట్లు, విత్తనాలు వివిధ రకాల వ్యవసాయ సామాగ్రిని తెచ్చుకోవడానికి సహాయపడతాయి కావున ఇలాంటి విషయాలన్నీ ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు దృష్టిలో ఉంచుకొని మేము పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని కొని, మా ఖాతాలలో తక్షణమే నగదును జమ చేయాలంటూ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ తరపున కూడా రైతులకు ఎలాంటి కష్టాన్ని రాకుండా చూడాలని విన్నపించుకుంటూ మొక్కజొన్న ధాన్యాన్ని వెంట వెంటనే కొని రైతులకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి సభ్యుడు కామ్రేడ్ రంగన్న. ఎల్కూర్ గ్రామ సహాయ కార్యదర్శి వెంకటేష్. వివిధ గ్రామాల రైతులు రంగస్వామి. వెంకటన్న. పరశురాముడు తదితరులు పాల్గొనడం జరిగింది.