
జనం న్యూస్ : 8 మే శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జ్ వై.రమేష్; సిద్దిపేట పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ స్కూల్లో నిర్వహించిన డ్రాయింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలు ఉదయం 10:00 గంటల నుండి 11:30 గంటల వరకు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.ఈ పోటీలలో మొదటి బహుమతిని ఆర్. యత్విక సాధించగా, రెండో బహుమతిని జె. ఋత్విక అందుకున్నారు. పాల్గొన్న మిగతా విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ నరేష్ విజేతలకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు.ఎలిగేటి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్, డ్రాయింగ్ టీచర్ వై. రమేష్ మాట్లాడుతూ,“చిత్రలేఖనం అనేది కేవలం కళ మాత్రమే కాదు, మనసులోని భావాలను ప్రపంచానికి తెలియజేసే అద్భుతమైన భాష” అని పేర్కొన్నారు.అలాగే, “ప్రతి గీతలో సృజనాత్మకత, ప్రతి రంగులో ఒక భావం దాగి ఉంటుంది — అదే నిజమైన కళ” అని అన్నారు.ఈ కార్యక్రమంలో క్యాతం అశోక్, మనోజ్ కుమార్, , రాణి ప్రియాంక, కల్పనా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు తమ సృజనాత్మక చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్నారు.