
జనం న్యూస్ మే 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి అమీర్ పేట మైత్రివనం చౌరస్తా వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడంలో అన్న నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో నడుస్తున్న రేవంత్ రెడ్డి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ టిపిసిసి ఉపాధ్యక్షులు కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ కలసి మైత్రివనం వద్ద నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో అన్న నందమూరి తారక రామారావు అభిమానులు మందలపు సాయిబాబు చౌదరి పాల్గొనడం జరిగింది