

జనం న్యూస్ మార్చి 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- కోదాడ ఎలక్ట్రాక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన మీడియా రంగానికి తీరని లోటని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి అన్నారు. శుక్రవారం ఐజేయు ఆధ్వర్యంలో రఘు కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రవటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 20 వేల రూపాయల ఆర్థిక సాాయాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియా రంగంలో రఘు కనపరిచిన ప్రతిభ ఎనలేనిదని కొనియాడారు.ఆయన మృతికి ఐజేయు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టు రఘు కుటుంబానికి అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సలిగంటి మురళి,ఆవుల మల్లికార్జున్, శ్రీనివాస్, దామోదర్,అజయ్,కరుణార్, రమేష్, నాగరాజు తదితర జర్నలిస్ట్లు పాల్గొన్నారు….