


జనం న్యూస్ మార్చ్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో :తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఏర్పాటు చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం -2005 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ కబీర్, వంగారి ప్రవీణ్, కుమ్మరిలింగయ్య లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రోజున కాగజ్నగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ రాష్ట్ర సమాచార కమిషన్ పదవి
కాలం ముగిసి రెండు సంవత్సరాలు అవుతుందని, అప్పటి నుండి సమాచార కమిషన్ ఏర్పాటు చేయక పోవడంతో సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. సమాచార కమిషన్ లేకపోవడంతో ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పిలెట్ అధికారులు సమాచారం అందించడంలో నిర్లక్షం వహించే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు కోరే సమాచారం సకాలంలో అందకపోవడం వల్లన చట్టం పైన ప్రజలకు విశ్వాసం పోయే అవకాశం ఉందని అన్నారు. సమాచార హక్కు చట్టం పకడ్బందీగా, పారదర్శకంగా అమలు కావడం కొరకు గతంలో రాష్ట్ర హైకోర్ట్ సూచించిన విధంగా రాష్ట్ర సమాచార కమిషన్ త్వరగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా త్వరగా రాష్ట్ర సమాచార కమిషన్ ను ఏర్పాటు చేసి సమాచార హక్కు చట్టం బలోపేతం గా అమల కొరకు కృషి చేయాలని, రాష్ట్ర ప్రజలకు సహ చట్టంపై నమ్మకం కలిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.