

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఇప్పుడు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు మాజీమంత్రి ప్రత్తిపాటి నాడు-నేడు పథకంపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థుల జీవితాలతో ఆటలాడిన అవినీతి పరుల్ని కఠినంగా శిక్షించాలని మంత్రి లోకేశ్ ను కోరుతున్నా : ప్రత్తిపాటి. 12 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యేలా చేయడమే జగన్ విద్యారంగంలో సాధించిన ప్రగతి : పుల్లారావు. పీ ఆర్సీ అడిగిన ఉపాధ్యాయులపై కక్షసాధింపులకు పాల్పడి మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన ఘనత జగన్ ది : పుల్లారావు. రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర విద్యారంగంలో నూతన సంస్కరణలకు లోకేశ్ శ్రీకారం చుట్టారు : పుల్లారావు విద్యార్జనతో ఎందరో సామాన్యులు, అసామాన్యులుగా ఎదిగారని.. ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఏ.పీ.జే. అబ్దుల్ కలామ్, నీలం సంజీవరెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహానీయులే అందుకు నిదర్శమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర విద్యారంగం-ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా విద్యారంగంలో ఎవరూ చేయని నూతన సంస్కరణల అమలుకు లోకేశ్ శ్రీకారం చుట్టారు..జగన్ హయాంలో 12 లక్షల విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్ ఒక సందర్భంలో సమాజంలోని సభ్యుడిగా అన్ని సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా తన లక్ష్యాలను నెరవేర్చుకునే ఏకైక ప్రక్రియ విద్య అని అభిప్రాయడ్డారు. అటువంటి కీలకమైన విద్యాశాఖను యువనేత, డైనమిక్ లీడర్ నారాలోకేశ్ నిర్వహిస్తుండటం శుభపరిణామం. గత రెండు దశాబ్దాల్లో ఎవరూ చేయని విధంగా విద్యారంగంలో నూతన సంస్కరణల అమలుకు లోకేశ్ శ్రీకారం చుట్టారు. అంతా బాగుందని నమ్మించే ప్రయత్నం చేయకుండా, గత ప్రభుత్వ లోపాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ లోకేశ్ ముందు కెళుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హాయాంలో 12 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారని తెలిశాక ఆశ్చర్యపోయాము. అంతటి దరిద్రపు పాలన గత ముఖ్యమంత్రి చేయబట్టే 12 లక్షల విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. 587 పాఠశాలలు మూతపడేలా, 1365 ఎయిడెడ్ విద్యాసంస్థలకు తాళాలుపడేలా గతప్రభుత్వం వ్యవహరించిందన్నారు. టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టడం, వారితోనే మరుగుదొడ్లు శుభ్రం చేయించడం వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడటం ద్వారా జగన్ వారిపై కక్షసాధింపులకు పాల్పడ్డాడు. పీఆర్సీ అడిగారని లాఠీఛార్జ్ చేయించాడు. నెలలో 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహణ మంత్రి లోకేశ్ పనితీరుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్ అమల్లో మార్పులకు శ్రీకారం చుట్టి, ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయడం లోకేశ్ చిత్తశుద్ధికి నిదర్శనం. గత ముఖ్యమంత్రిలా మాట ఇచ్చి తప్పకుండా, ఈ ప్రభుత్వం ఈ నెలలోనే 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించనుండటం లోకేశ్ పనితీరుకు నిదర్శనం. జగన్ తీసుకొచ్చిన చీకటి జీవో 117 రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వం బకాయిపెట్టిన 788కోట్లను ఈ ప్రభుత్వం విద్యార్థులకు అందించింది. అమ్మఒడి పేరుతో జగన్ తల్లుల్ని వంచించి, చదివే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలు ఇస్తానని నమ్మబలికి చివరకు విద్యార్థుల సంఖ్యలో, చెల్లింపుల్లో కోతలు పెట్టాడు. జగన్ లా కాకుండా తల్లికి వందనం మే నెల నుంచి కూటమి ప్రభుత్వం పారదర్శకంగా అమలుచేయనుంది. విద్యార్థులకు 6,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, ఇతర బకాయిలు ఎగ్గొట్టిన జగన్, ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు. పాఠశాలల భవనాలకు రంగులు వేసి వేలకోట్లు దిగమింగిన వైసీపీ ప్రభుత్వం, విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కూడా కల్పించలేదు. జీవో 77 తో పీజీ విద్యార్థులకు ఫీజీ రీయింబర్స్ మెంట్ రద్దుచేసిన ఘనత కూడా జగన్ దే. 6,500 కోట్లకు పైగా విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు పెట్టిన జగన్ సిగ్గులేకుండా ధర్నాలకు పిలుపునిస్తున్నారు. విద్యార్థుల కిట్లు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరాలో కూడా అవినీతికి పాల్పడిన ఘన చరిత్ర జగన్ ది. గత ప్రభుత్వంలో కంటే 30శాతం తక్కువ కు టెండర్లు రావడం ఈ ప్రభుత్వంలో జరిగింది. ఇవన్నీ గమనించాక నాడు-నేడు పథకంపై సమగ్ర విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రి లోకేశ్ ను కోరుతున్నాను. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమలుకోసం విద్యాశాఖ మంత్రి లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించి విద్యార్థుల జీవితాలు బాగుపడనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఆలోచననలు నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకాన్ని, ఆశల్ని నిజం చేసేలా లోకేశ్ విద్యాశాఖ ను సమర్థవంతంగా నిర్వహిస్తుండటం ప్రజలకు గర్వకారణం.” అని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.