Listen to this article

జనంన్యూస్.14. నిజామాబాదు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ. నిజామాబాద్ నగరంలో నిన్న అర్ధరాత్రి కస్టోడియల్ డెత్ చెందిన సంపత్ మృతిపై సమగ్రంగా సిట్టింగ్ జడ్జితో న్యాయవిచరణ జరిపి చట్టపరామయినా చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి వద్ద సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకొని మీడియా సమావేశం నిర్వహించారు.