


దుబ్బాక బాలాజీ దేవాలయంలో మారు మ్రోరోగిన రామనామం గ్రామ, గ్రామాన నిర్వహిస్తున్న రామకోటి సంస్థ రామకోటి రామరాజు చేస్తున్న కృషికి సన్మానం జనం న్యూస్, మార్చ్ 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రామ నామమే ప్రాణమని శ్రీరామకోటి భక్త సమాజం చేస్తున్న గత 26సంవత్సరాల ఆధ్యాత్మిక కృషి, పట్టుదలను గుర్తించి భద్రాచల దేవస్థాన గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని ముచ్చటగా మూడో సారి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు 250కిలోల వడ్లను అందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రామకోటి రామరాజు గారు గ్రామ, గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే గోటి తలంబ్రాలు ఓలిపిస్తున్నారు. అందులో భాగంగా శనివారం నాడు దుబ్బాకలోని శ్రీ బాలాజీ దేవాలయంలో కోటి తలంబ్రాల దీక్ష పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో 300 మందికీ పైగా భక్తులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి రామకోటి రామరాజు,కి అక్కడే అందజేషి రామభక్తిని చాటుకున్నారు. మేము భద్రాచల వెళ్ళలేకున్న మా తలంబ్రాలు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అద్భుత అవకాశం కల్పించినందుకు భక్తులు రామకోటి రామరాజును ఆలయం వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అచ్చి లక్ష్మీ నర్సింహా ఆచార్య, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.