Listen to this article

వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి.. జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. నిరుద్యోగ యువతకు ఒక్క వరంగా..రాజీవ్ యువ వికాసం పథకం క్రింద కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుందని, రేషన్ కార్డులో పేర్లు ఉన్న వారు మాత్రమే దరఖాస్తులకు అర్హులని ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గర ఉండి దరఖాస్తులను ఆన్లైన్లో చేయించవలసిందిగా వీణవంక మండల గ్రామ యువతకు ఎక్కటి రాగుపాల్ రెడ్డి, వీణవంక మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలిపారు.దరఖాస్తులు ప్రారంభం: తేది :17-03-2025 నుండి05-04-2025 వరకు ఉంటుందని తెలిపారు. కాగా దరఖాస్తులు అర్హులైన వారికి రుణాలు మంజూరు చేసే తేది 02-06-2025 వరకు రుణాలు మంజూరు చేస్తారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు 60 నుంచి 80 శాతం వరకు రాయితీలు ఉంటాయి అని ఒక్కో లబ్ధిదారుడికి రూ.4 లక్షల వరకు మంజూరు చేస్తారు అని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులకు కావాల్సిన పత్రాలు:1. ఆధార్ కార్డు2. రేషన్ కార్డు3. ఆదాయ ధ్రువపత్రం4. కులం ధ్రువపత్రం 5. ఫొటో6. బ్యాంక్ అకౌంట్ బుక్7. ఫోన్ నెంబర్ తప్పనిసరి ఉండాలని సూచించారు.రేషన్ కార్డులో పేర్లు ఉన్న వారు ప్రతి ఒక్క నిరుద్యోగ యువత దరఖాస్తులను ఆన్లైన్ చేయించవలసిందిగా రఘుపాల్ రెడ్డి కోరారు.