

బిచ్కుంద ఏప్రిల్ 7 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు ఈనెల 9 తేదీన జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ప్లేస్మెంట్ సెల్, రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ జాబ్ మేళాలో “ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో జూనియర్ ట్రైనీ ఉద్యోగాలకు” ఎంపిక జరుగుతుందని తెలిపారు. కెమిస్ట్రీ ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి 2021, 2022 ,2023, 2024 లలో బీఎస్సీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అన్నారు. ప్రస్తుతం బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా హాజరు కావచ్చు అని తెలిపారు. అర్హత కల విద్యార్థులు ఈనెల 9న ఉదయం 10 గంటలకు బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో జరిగే జాబ్ మేళాకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బిచ్కుంద, జుక్కల్,మద్నూర్ ప్రాంత పరిధిలోని సైన్స్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.