Listen to this article

జనం న్యూస్ 08ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం.


జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో పేదలకు సన్న బియ్యం పథకాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరవేస్తుందని మరియు సన్న బియ్యం పథకం నిరుపేదలకు ఒక వరం అని చెప్పారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు,రేషన్ డీలర్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు