

హాజరైన వివిధ పార్టీల ముఖ్య అతిథులు నాయకులు .
జనం న్యూస్. ఏప్రిల్ 6. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రమైన హత్నూర. నవాబుపేట్. మధుర. గోవిందరాజు పల్లి. నస్తీపూర్, చింతల్ చెరువు.తదితర గ్రామాల్లో సీతారాముని కళ్యాణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామాల్లోని ఆలయాల ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించి శ్రీ సీతారాముని కళ్యాణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు, ఈ ఉత్సవాల్లో ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని విధాల సౌకర్యాలు కల్పించారు. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమంలో. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య అతిధులు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ఆవుల రాజిరెడ్డి. డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్.బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్. నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ,శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.ఒకే మాట. ఒకే బాణం.ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముని జీవితాంతం ధర్మాన్ని నమ్ముకున్నాడన్నారు,ధర్మం కోసం యుద్ధం చేసి విజయం సాధించాడన్నారు, మానవ అవతారం ఎత్తిన శ్రీరాముడు నడిచినదారి,నమ్ముకున్న ధర్మం ఆయన గుణగణాలతో శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవఅవతారంగా ప్రసిద్ధి చెందాడన్నారు,పితృ వాక్య పరిపాలనకు తండ్రి దశరథుడి మాటకుకట్టుబడి శ్రీ రాముడు అయోధ్యారాజ్యాన్నివదిలి అరణ్యవాసంవెళ్ళారని..ఆస్తులుఅధికారం రాజభోగాలు ముఖ్యంకాదని విలువలే ప్రధానమని ఆయన జీవితం చాటుతుందన్నారు, శ్రీ రాముని రాజ్యంలో ప్రజలను తనకన్నబిడ్డల్లా తన కంటి పాపల్లాగా చూసుకున్నాడని ,వారి శ్రేయస్సుకంటే తనవ్యక్తిగత జీవితం తన ఆనందం గురించి ఎప్పుడు ఆలోచించలేదన్నారు. శ్రీ రామునిబాటలో ప్రజలంతాసాగాలని కోరారు.శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె అన్నారు.

