Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 11. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేసి సామాజిక సంస్కరణలకు నాంది పలికిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని హత్నూర తాసిల్దార్ పర్వీన్ షేక్ కొనియాడారు. శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మండల కేంద్రమైన హత్నూర తాసిల్దార్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. స్త్రీల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు మహనీయుడు పూలే ఎంతో కృషిచేశారని తెలిపారు. భారతదేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త పూలే అని అభివర్ణించారు. సమ సమాజ స్థాపనే జ్యోతిరావు పూలే లక్ష్యమని. స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఉద్ఘాటించారు. సమసమాజ నిర్మాణంలో జ్యోతిరావు పూలే కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు .మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘన నివాళి అని తాసిల్దార్ పర్వీన్ షేక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో. డిప్యూటీ తాసిల్దార్. దావూద్ అహ్మద్. శాంతయ్య. నల్లోల్ల పెంటయ్య. పొట్లగళ్ల శంకర్. సాయిలు. కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన హత్నూర గ్రామంలో. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు.ఈ కార్యక్రమంలో.ఎర్రోళ్ల నర్సింహులు. నల్లోల్ల ఎల్లయ్య. ఉష్ణగళ్ళ కృష్ణ. కొండగళ్ల రవి. తదితరులు పాల్గొన్నారు.