


జనం న్యూస్, ఏప్రిల్ 15, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
మహనీయ మూర్తి , గౌరవ, శ్రీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని AGP కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన
పెద్దపెల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు గవర్నమెంట్ అసిస్టెంట్ లీడర్ (AGP), తాజా మాజీ కౌన్సిలర్, శ్రీ చైతన్య యూత్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పు రాజన్న ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఎంతో సుదినం.మానవజాతి చరిత్రలో చిరస్మరణీయులైన మహామహుల కోవలకు చెందిన ఒక మహనీయమూర్తి డా.అంబేద్కర్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అని అన్నారు.భారతీయ సమాజానికి తీరని కళంకం అంటరానితనం అవి పూజ్య బాపూజీ ఏనాడో ప్రవచించిన విషయం అందరికీ విదితమే.ఆస్పృశ్యత వంటి ఘోరమైన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడం,అట్టడుగున పడి అజ్ఞానంలో,దారిద్ర్యంతో,అంధకారంలో అలమటిస్తున్న అసంఖ్యాక దళిత జనావళిని ఆదుకోడానికి,వారి అభ్యున్నతికి కృషి చేయడానికి అవతరించిన పవిత్ర మూర్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే అతిశయోక్తి లేదు.తాను చిన్నతనం నుండి ఏ బాధలకు,ఏ అవమానాలకు,ఏ అలక్షానికి గురియై,ఏ సాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ స్వశక్తివల్ల,స్వయం ప్రతిభ వల్లపైకి వచ్చారో,అసమానతలను,ఆ అవమానాలను,ఆ సాంఘిక దురాచారాలను తన తుది శ్వాస వరకు ప్రతి ఘటిస్తూనే వున్నారు బాబా సాహెబ్.ఆయన ఆచంచలమైన దీక్ష,పట్టుదల మనకు ఆదర్శం కావాలి.ఆయన ఏ ఆశయాల కై తన జీవితాన్ని ధారపోశారో ఆ ఆశయాలు మనకు మార్గదర్శకాలు కావాలి. తరాలు గడచినా తలరాత మారలేదన్నట్లు మనం 20 వ శతాబ్దపు చివరి భాగంలో వున్నా,ఎంతో శాస్త్రీయమైన అభివృద్ధిని సాధించినా మనం మనిషికీ మనిషికీ మధ్య గీసుకొన్న గళ్లు చెదరిపోలేదు.మనం పెంచుకొన్న బ్రహ్మజముడు ముళ్లదళ్లు చెదిరిపోలేదు.మన సమాజాన్ని పీల్చి పిప్పిచేస్తూ అనైక్యతకు దారి తీస్తూ,పరస్పర విద్వేషాలకు,అనుమానాలకు,అసూయలకు అవకాశం యిస్తూ వున్న విష వృక్షం కులవ్యవస్థ ను సమూలంగా పెకలించి వేయవలసిన అవసరాన్ని గురించి బాబా సాహెబ్ నిరంతరం బోధిస్తూనే వున్నారు.మనిషి చంద్రమండలంలోకి అడుగు పెట్టగలిగాడు.ఒక భారతీయుడు అంతరిక్షంలోకి ఎగిరి మన దేశ పతాక ను వ్యోమపథంలో ఎగురవేయ గలిగాడని మనం ఎంతో గర్వ పడుతున్నాం అయినా మన మధ్యనే వున్న అంతరాలను చెరిపేవేయలేక,అడ్డు గోడలను పడగొట్ట లేకపోతున్నాం.ఈ విషయంలో విద్యావంతులైన వారంతా ముందు వచ్చి సమాజంలో చైతన్య కాంతులు ప్రజ్వరింపజేయాలి.కాలం చెల్లిన పాత సాంప్రదాయాలకు,ఆచారాలకు సాంఘిక బంధాలకు స్వస్తి చెప్పాలి.ఆనాడే అంబేద్కర్ వంటి మహనీయులకు మనం నిజమైన భక్త్యంజలి అర్పించ గలుగుతాం.అదే వారికి నిజమైన నివాళి ఆవి మనవి చేస్తున్నాను.తరతరాలుగా కాలం చెల్లిన కర్మ సిద్ధాంతం పేరుతో సాంఘికంగా ఘోరమైన అన్యాయాలకు, అవమానాలకు గురవుతూ,ఆర్థికంగా దుర్భర దారిద్య్ర్యం అనుభవిస్తూ కాలం గడుపుతున్న కోట్లాది షెడ్యూల్డు కులాల సోదరీ సోదరులకు నూతన జీవితం ప్రసాదించడానికి,వారి రాజ్యాంగం ప్రసాదిస్తున్న సమాన హక్కులు వాస్తవంగా వారికి లభింపజేయడానికి మనమందరం నడుం కట్టుకోవాలి. డా.అంబేద్కర్ కృషి కారణం గానే మన రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన ఆధ్యాయం ఫండమెంటల్ రైట్స్ సంబంధించింది చేర్చబడిందన్న సంగతి మనం మరువరాదు.ఆ మహనీయుని నిరంతరం కృషి వల్లనే సర్వ పౌరజన సమానత్వం ప్రాతిపదికగా సంక్షేమ రాజ్యస్థాపనకు పునాది వేయబడిందని మనం విస్మరించరాదు.ఆ మహా సంస్కర్త పూనిక వల్లనే హిందూ ధర్మశాస్త్ర క్రోడీకరణ సంస్కరణసాధ్యమయ్యాయి.ఆయన కలలుకన్న సంక్షేమ రాజ్యాన్ని స్థాపించుకొన్న నాడే అంబేద్కర్ వంటి మహనీయుని కలలు నిజంచేయగలుగుతాం.ఆ దిశ గా మనమందరం నిరంతరం సాగించాలని మనవి చేస్తున్నాను.బాబా సాహెబ్ వంటి మహనీయులు ఏ ఒక్క కులానికో,ఏ ఒక్క ప్రాంతానికో,ఆ మాటకు వస్తే ఏ ఒక్క దేశానికి చెందినట్లు భావించడం అది సంకుచితత్వం అవుతుందని మనవి చేస్తున్నాను. డా.అంబేద్కర్ వంటివారు సర్వ మానవాళికి విశ్వజనీనులైన ఆదర్శమూర్తులు.ఆశయం పర్వమానవ శిరోధార్యం.ఈ శుభ సందర్భంలో ఆ మహనీయుని ఆశయాల సాధనకు మన మందరం పునరంకితం, దీక్షతో, కృషితో ఆయన ఆశయ సాధనాల కోసం కృషి చేయాలన్నారు. అనంతరం ప్రజలందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాల్వ గట్టయ్య, వరాల కనకయ్య,ఉప్పురాంచందర్, నాగుల ఓదెలు,బూత్కూరి నర్సింగం, కొంతం సురేష్, ఆసిఫ్, అశోక్, వరాల సంపత్, రామారావు,అంగిడి కుమార్, వంశీ, ఇన్సూరెన్స్ కుమార్,అంగిడి రవి, తాళ్ల కళ్యాణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.