Listen to this article

మల్టీజోన్ ఐజి పి.సత్యనారాయణ

జనం న్యూస్. ఏప్రిల్ 24. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి (అబ్దుల్ రహమాన్)

మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని.మల్టీ జోన్-ll ఐజి. పి. సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజి మాట్లాడుతూ.సంగారెడ్డి జిల్లా, జిన్నారం గ్రామ శివారులో నూతనంగా నిర్మాణంలో ఉన్న శివాలయం ముందు ఉన్న శివుని విగ్రహం ధ్వంసం అయిన విషయమై తేది: 22.04.2025 నాడు సాయంత్రం జిన్నారం మండలంలో జరిగిన సంఘటనలపై జిల్లా ఉన్నత అధికారులచే దర్యాప్తు చేయించగా విచారణ అనంతరం తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి 19.04.2025 రోజున సాయంత్రం 5:24 గంటల సమయం కొన్ని కోతులు వచ్చి శివుని విగ్రహం గుట్ట పై నుండి క్రిందికి తోసేసాయి. దీంతో శివుని విగ్రహం కిందపడి ధ్వంసం అయిపోయింది. కొన్ని కోతులు గుట్టపై నుండి విగ్రహాన్ని కిందికి తోసేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సిసి ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డయినట్లు తమ దర్యాప్తుల్లో తేలిందన్నారు.
వివరాలలోనికి వెళితే.తేది: 22.04.2025 నాడు సాయంత్రం గేమ్స్ ముగించుకొని శివాలయం వైపు నుండి నడుచుకుంటూ వస్తున్న మదర్సా విద్యార్ధులను చూసిన కొందరు స్థానికులు వారిని ప్రశ్నించిన అనంతరం శివాలయం వద్ద ధ్వంసమైన శివుని విగ్రహాన్ని చూసి, మదర్సా విద్యార్ధులే ఈ పని చేసినట్లుగా భావించి.పూర్తి వాస్తవాలను తెలుసుకోకుండా కొంత మంది వ్యక్తులు పెద్ద సంఖ్యలో వెళ్ళి మదర్సాలో ఆస్థి నష్టం చేయడం జరిగిందనిఅన్నారు. మదర్ సాకు చెందిన పిల్లలకి ఈసంఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఐజి స్పష్టం చేశారు. అసలు వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు వ్యక్తులు లేనిపోని పుకార్లు సృష్టించి మతవిద్వేషాలను రెచ్చగొట్టారని తెలిపారు. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలుచేసి,ప్రజలను రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేస్తూ,ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని, అట్టి వ్యక్తులపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గతంలో జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరిగాయని, గత 6 నెలల క్రితం సదాశివపేటలోని ఓగుడిలో ఆవులు ధ్వంసం చేస్తే,ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేయడం జరిగిందని, విచారణలో వాస్తవాలు రాబట్టి సమస్యకు పరిష్కారం చూపడం జరిగిందని అన్నారు.
జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రజలందరూ మత సామరస్యం కలిగి ఉండాలని, శాంతి భధ్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు. ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు సమీప పోలీసు స్టేషన్ లో సమాచారం అంధించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యల చేసినా, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినా చట్టరిత్య కఠిన చర్యలు ఉంటాయని ఐజి హెచ్చరించారు. అట్టి సంఘటనలో అనవసర రూమర్స్ ప్రచారం చేసి, ప్రజా శాంతికి విఘాతం కలిగించిన వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని అన్నారు. ఈ సమస్యను జటిలం కాకుండా త్వరితగతిన స్పందించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి ఐపిఎస్, సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారులను,సిబ్బందిని ఐజి అభినందించారు.