

జనం న్యూస్ ఏప్రిల్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని మాందారిపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, నాయకులు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రేణుకంట్ల సదయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ దుబసి కృష్ణమూర్తి మారి సంస్థ మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…..