Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 30(నడిగూడెం)

కుక్కలు దాడిలో 31 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నడి గుడెం గ్రామానికి చెందిన వట్టె సతిష్ గోర్రె పిల్లలు మేతకు గ్రామ వెలుపలకు వెళ్లగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో31 గొర్రె పిల్లలు చనిపోయాయని,వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు. బాధితున్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.