Listen to this article

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ జనం న్యూస్ 01మే పెగడపల్లి ప్రతినిధి


జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో బీజేపీ అధికార ప్రతినిధి మర్రి పెల్లి సత్యం, మాట్లాడు తూ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ నేతలు పాకిస్థాన్ వెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయమని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ అన్నారు. నలుగురు ఉగ్రవాదులు వచ్చి కాల్చిపోతే ఇంతవరకు తీవ్రవాదులను మోడీ, ఎందుకు పట్టుకోలేదని చులకన భావంతో మాట్లాడిన ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి,వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్నప్పుడు రోజు భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరిగేవని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత సైనికులకు స్వేచ్ఛను ఇవ్వకపోవడం వల్ల నిత్యం భారత సైనికులు కాల్పులకు గురయ్యేవారని కానీ నరేంద్ర మోడీ, ప్రభుత్వం ఏర్పడ్డాక శత్రుదేశాలతో పోరాడడానికి సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో నేడు సరిహద్దు ప్రాంతంలో పహార కాస్తున్న సైనికులు ఆత్మస్థైర్యంతో శత్రువులకు ఎదురు నిలిచి పోరాటం చేస్తూ శత్రుదేశ సైనికులను మట్టికరిపిస్తున్నారని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు భారత సైనికులు చేసిన సర్జికల్ స్ట్రైక్ ను తప్పుపట్టడం భారతీయ ఆచార సంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడి కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ భారతమాత అంటే ఎవరని అసలు భారతమాత ఉందా అంటే మరో కాంగ్రెస్ నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఈ దేశంలో ఉన్న భారతీయులందరికీ భారతమాత తల్లి అయితే మరి తండ్రులు ఎంతమంది అని ప్రశ్నించారని మరో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, నేను పాకిస్థాన్ను ప్రేమిస్తా అని బాహాటంగా చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలందరికీ హృదయాలను గాయపరిచాయని అన్నారు. ప్రస్తుతం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదే కోవలో మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. జమ్మూ కశ్మీర్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఉగ్రవాదులు హిందూ పర్యాటకులపై కాల్పులు జరిపారని ప్రపంచంలో పాకిస్థాన్ ను ఒంటరిని చేయడానికి మోడీ, పట్టు బిగించిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.26/11 ముంబయి కాల్పుల్లో శిక్ష పడిన కసబ్ ను కాపాడడానికి అర్ధరాత్రి సుప్రీం కోర్టు తలుపులు తెరిపించిన ఘనత తహవూర్ రాణాకు కూడా హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని దుయ్యబట్టారు. భారత్ జోడో యాత్ర ముగింపు సందర్బంగా కాశ్మీర్ లో ఉగ్రవాదులు రాహుల్ ను కలిసి మాట్లాడాలని ఎందుకు కోరుకున్నారో ఎంపీ చామల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు