

మండల టాపర్ గా గిరవేణ స్పందన
జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // జమ్మికుంట// కుమార్ యాదవ్
..పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జమ్మికుంట మండలం లోని ప్రభుత్వ పాఠశాలలు అన్ని చక్కటి విజయాన్ని అందించారు.మండలంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 360 మంది పరీక్షలకు హాజరుకాగా, 345 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 95.84% సాధించడం అద్భుతమైన విజయం, కోరపల్లికి చెందిన విద్యార్థిని గిరవెనా స్పందన 600 మార్కులకు 557 మార్కులు సాధించి, మండల టాపర్గా విజయజం సాధించిది. బాలురు జమ్మికుంటకి చెందిన ఆశ్లేష అనే విద్యార్థి 546 మార్కులతో ద్వితీయ స్థానం పొందాడు.ఈ విజయానికి చిహ్నంగా మండలంలోని 5 ప్రభుత్వ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించడం అద్భుతమైన విశేషం. విజయం సాధించిన విద్యార్థులను కళాశాల లా హెచ్ఎం లు సమ్మయ్య, సదానందం, వేణుగోపాల్, అంజుమ్, పద్మ, సుప్రియ వీరిని అభినందించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మంథెన హేమలత మాట్లాడుతూ, “రానున్న రోజుల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు మరింత కృషి చేస్తాం,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.