Listen to this article

జనం న్యూస్,,ఏప్రిల్ 30,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి

మండల పరిధిలోని పదవ తరగతి పరీక్షలు వ్రాసిన విద్యార్థిని విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారని ఎంఈఓ రహీమొద్దీన్ తెలిపారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ 582 మార్కులతో రాథోడ్ పరశురామ్,మండల్ ప్రథమ స్థానాన్ని సాధించారు.లిటిల్ స్టార్ పాఠశాల విద్యార్థినిలు 580 మార్కులతో ఆలూరే భాగ్యశ్రీ, మండల ద్వితీయ స్థానాన్ని సాధించారు.తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 107, మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 107, ఉత్తీర్ణులయ్యారని అన్నారు.తడ్కల్ ఉర్దూ మీడియం పాఠశాల నుంచి పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారని అన్నారు.కంగ్టి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పరీక్షలు వ్రాసిన విద్యార్థిని విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులయ్యారు.కంగ్టి మండల పరిధిలోని పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థినీ విద్యార్థులు అందరూ తీర్ణత సాధించడం జరిగిందని ఎంఈఓ తెలిపారు.