

జనంన్యూస్. మే. 01. నిజామాబాదు. ప్రతినిధి.
మే డే స్ఫూర్తితో మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పి కొట్టాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపును ఇచ్చారు. గురువారం నాడు ధర్పల్లి కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద నిర్మించిన జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ మాట్లాడుతు కార్మిక హక్కుల కోసం ,కార్మికుల పని గంటల తగ్గుదల కోసం, కార్మిక వేతనాల పెంపు కోసం, సరైన పనికి సరైన వేతనం సాగిన పోరాటంలో చిందిన ఎర్రనీ రక్తమే ఈ ఎర్రజెండా .
ఎన్నో వందల సంవత్సరాలు పోరాడి కొట్లాడీ తెచ్చుకున్న ఈ హక్కులను మనం కాపాడుకోవాలి.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాల రాస్తున్నది ,కార్మిక చట్టాలను ఆధాని, అంబానీ, బడాబడా వ్యాపారవేత్తల వద్ద నరేంద్ర మోడీ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్ళు తప్ప అనే నినాదాన్ని మనం గోతెత్తి చటాలి. మన హక్కుల సాధన కోసం మళ్ళీ మన ఉద్యమించాలి. కార్మిక హక్కులను విస్మరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, గద్దె దించాలి, అని వారు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం మతాల పేరుతోటి చిచ్చులు పెట్టీ స్వేచ్ఛగా బతుకుతున్న ఈ మనుషుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి మారణ హోమం సృష్టించడం అబ్రాజస్వామికమైన చర్య. ఇది మతోన్మాదం, దీనిని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, మీ వైఖరి మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలను నిర్మిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టీయుసి ఐ), జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడాగా.సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు ఎం లింబాద్రి, ఎల్. నరేష్, కిరణ్, తెలంగాణ ప్రజల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఆశన్న, మండల కమిటీ అధ్యక్షులు సాయిలు, విలాస్, కృష్ణ, రాజన్న, భోజన్న,వర్శిత్, గంగాధర్, వసంత, కస్తూరి, రాజు, జయ సులోచన, రాజన్న, లింగం బాలకిషన్, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.