Listen to this article

జనం న్యూస్ // మే // 1 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు పోరాడారని, పోరాటాల ఫలితంగానే కార్మికుల్లో చైతన్యం వెళ్లివిరిసిందని ,శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని, కార్మికులు తమ హక్కులు సాధించుకున్న రోజే, ఈ నాటి మేడే, రోజని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. గురువారం నాడు సమాఖ్య కార్యాలయం లో నిర్వహించిన మేడే దినోత్సవ కార్య క్రమంలో పోలాడి రామారావు పాల్గొన్నారు. ఇ సందర్బంగా వారు మాట్లాడుతూ..కార్మికులు, కర్షకులు, అధునాతన పరిజ్ఞానంతో ముందుకెళ్లాలని కోరుతు, కార్మిక వర్గం తరపున నిలబడే వారికి అండగా ఉండటమే తమ ధ్యేయమని, దేశంలోని కార్మికులందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్ననాన్నరు. దేశవ్యాప్తంగా జనగణ తో పాటు కులగణన చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంతోదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చుతుందని , ఎన్నో సామాజిక సమస్యల పరిష్కారానికి మార్గ నిర్దేశనం అవుతుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పాలకులకు దన్యవాదాలు తెలుపారు. దీనికి కాల పరిమితి తో చట్టబద్ధత తో కూడిన పార దర్శకంగా పక్కా ప్రణాళిక విది విధానాలు ప్రకటించాలని పోలాడి విజ్ఞప్తి చేశారు.