Listen to this article

ఎండీ సాజిద్ అలి.. బిఅర్ఎస్ పార్టీ నాయకులు..

జనం న్యూస్ // మే // 1 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం, కోరపల్లి గ్రామ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ఫైనల్ లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భారీ అవకతవకలు చేశారన్నారు,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి సాజిద్ అలీ.. ఇ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇళ్ల కమిటీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారు చేసి మండల పరిషత్ అధికారి ఎంపీడీఓ కి ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ అందజేయడం జరిగిందన్నారు. ఈ లిస్ట్ పై ప్రజల నుండి వివిధ రకాలుగా బిన్న స్వరాలు అలాగే నిజమైన లబ్ధిదారులకు, ఇందిరమ్మ కమిటి , మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిజమైన న్యాయం చేయలేక పోయారన్నారు. అంతే కాకుండా అందినకాడికి ప్రజల వద్ద అడ్వాన్స్ ల రూపంలో వేల రూపాయలు దండుకున్నారన్నారు. మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే తప్ప, ఏ ఒక్కరికి కూడా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ఒక్క కాంగ్రెస్ నాయకులకేనా అని ప్రశ్నించారు. అమలు కానీ హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి, ఓట్లు దండుకున్న కాంగ్రెస్ సర్కార్ కు, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని సాజిద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేసారు.