

జనం న్యూస్ మే 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మునగపాక జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వాల కిట్లు మండల పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం ఆధ్వర్యంలో జనసైనికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను పాటించాలని గ్రామ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొల్లేటి ఆనంద్, వేగి కృష్ణ, కాశి, రవి తదితరులు పాల్గొన్నారు.