

సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్..
జనం న్యూస్ // మే //1 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )
జమ్మికుంట సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో 139 వ మే డే సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది . ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్ మాట్లాడుతూ…
పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే నినాదంతో 1886 లో చికాగో నగరంలో కార్మికులందరూ 8 గంటల పని దినాలు కావాలని ఉద్యమం చేస్తుంటే హే మార్కెట్లో కార్మికుల పై అమెరికా ప్రభుత్వం కాల్పులు జరపడం మూలాన కొంతమంది కార్మికులు చనిపోవడం జరిగింది అన్నారు. అదే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఎనిమిది గంటల పని దినాలు కావాలని 1886 నుండి 1890 మే 1 న అమలు కావడం జరిగిందన్నారు. అందువల్ల నే మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని అన్నారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాడాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంతవరకు, కార్మికులందరూ కలిసి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. గతంలో రైతు నల్ల చట్టాలను తీసుకువచ్చి, బిజెపి ప్రభుత్వం రైతులను దగా చేస్తుంటే రైతులందరూ కలిసి సంవత్సరం పాటు ఢిల్లీ నడిబొడ్డున పోరాడి 750 పైచిలుకు రైతులు మరణించిన తర్వాత ఆ నల్ల చట్టాలను రద్దు చేయడం జరిగిందన్నారు. బ్రిటిష్ వాళ్లు అప్పుడు పన్నుల రూపంలో కార్మికులను రైతులను ప్రజలను దోచుకుంటూ, నేడు బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికుల పొట్ట కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్రం సిద్ధించి 8 దశాబ్దాల కాలం కావస్తున్న కార్మికులకు కనీస వేతనం, అట్లాగే రైతులకు గిట్టుబాటు ధర చెల్లించకపోవడం సిగ్గుచేటు అన్నారు. జూన్ 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని ప్రజలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు జక్కుల రమేష్ యాదవ్, దండిగారి సతీష్, వడ్లూరి కిషోర్ కుమార్, కన్నం సదానందం, సల్ల కుమారు, నాయకులు గిరవెని రాజు, మదనయ్య, కిరణ్,తదితరులు పాల్గొన్నారు.