Listen to this article

జనం న్యూస్. మే1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతిరోజు త్రాగునీటి సరఫరాపై జిల్లా అధికారులతో సమీక్షించి నివేదిక ఇవ్వాలని మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి శ్రుద్ధ జలాలను అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఅధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే .అయితే(ఆర్ డబ్ల్యు ఎస్) పంచాయతీరాజ్ గ్రామీణఅభివృద్ధి అధికారుల పర్యవేక్షణ లోపంతో నిత్యం ఏదో ఒక సమస్య ఏర్పడి మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. పైప్ లైన్ మరమ్మతులంటూ మోటర్లు మరమ్మతులంటూ దాటవేస్తున్నారు. సమయానికి త్రాగునీళ్లు రాక వివిధ గ్రామాల్లో ప్రజలు త్రీవ ఇబ్బందులు పడక తప్పడం లేదు. అసలే ఎండాకాలం మండుటెండల్లో త్రాగడానికి నీళ్లు లేక ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఇదే పరిస్థితి మండల కేంద్రమైన హత్నూర గ్రామంలో నెలకొంది మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎండల త్రీవత పెరుగుతుంటే కనీసం త్రాగడానికైనా వాటర్ ట్యాంకర్ తో నీళ్లు సరఫరా చేయకపోతే ఎలా అని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వాటర్ ట్యాంకర్ ఉన్న ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.త్రాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడల్లా వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రతి.వార్డులో నీటి సరఫరా చేసి సమస్య పరిష్కరించాల్సిందిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి హత్నూర గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం అయ్యేలా చూడాలని గ్రామస్తులు కోరారు.