Listen to this article

జనం న్యూస్ 03 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )

ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో లింగంపల్లి వర్షిత్ 433/470 మార్కులు సాధించిన సందర్భంగా వర్షిత్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో సైతం విద్యార్థులు కార్పొరేటు కు ధీటుగా మార్కులు సాధిస్తున్నారు,విద్యార్థులకు ప్రభుత్వపరంగా అనేక సదుపాయాలు కల్పిస్తూ, పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం,ఈ అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం కె.సుదర్శన్,శ్రీదేవి, యం రమేష్ బాబు, స్వప్న, ప్రణీత, పేరెంట్స్ ఎల్. దయానంద్, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.