Listen to this article

మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన మార్కెట్ చేర్మెన్..

ఆర్థి దాడువైల సంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు..

జనం న్యూస్ // మే // 4 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)

జమ్మికుంట మండల నూతన తహసీల్దారు గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ రాజును శనివారం నాడు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం అర్థి మరియు దాడ్వాయిల సంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ.తహసిల్దార్ కార్యాలయానికి వచ్చే రైతు సోదరులు ప్రజలు వారి సమస్యల పట్ల అలసత్వం లేకుండా తక్షణమే పరిష్కరించాలని తహసిల్దార్ రాజును కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొడ్డ శ్యాం కుమార్, కందాల తిరుపతి, అర్థిదారులు మర్రి రాంరెడ్డి, ఎగిత అశోక్, మర్రి తిరుపతి, గుత్తి కుమార్, గౌడ శ్రీనివాస్,కొండారి రవీందర్, సతీష్ శ్రీనివాస్, మోహన్, పాపిరెడ్డి అర్థిదారులు తదితరులు పాల్గొన్నారు.