Listen to this article

జనం న్యూస్ మే 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన (డిడియు – జేకేవై) కార్యక్రమంలో భాగంగా గ్రామీణ నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉపాధి వైపు మళ్ళించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని 18-30 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువకులు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో నాలుగు నెలలు వివిధ రంగాలలో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ జ్ఞానాన్ని పెంచి భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడం ప్రధానంగా తీసుకున్నారని, ఈ కోవలోనే ఇలాంటి కార్యక్రమాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాబోవు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుందన్నారు. శిక్షణలో భాగంగా మండల పరిధిలో సుమారు 50 మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నట్లు డి డి యు -జే కే వై అధికారులు సునీల్, శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చల్ల చక్రపాణి_మారేపల్లి రవీందర్ చిందం రవి దుబాసికృష్ణమూర్తి భాస్కర్ మారేపల్లి రాజు కటయ్య కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు…