

జనం న్యూస్,మే03 అచ్యుతాపురం: మండలం లోని ప్రసిద్ధి గాంచిన
కొండకర్ల -అందలాపల్లి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి మహోత్సవం నూతన ఆలయం,విగ్రహం ప్రతిష్ట ఆహ్వానం పత్రికను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు.ఈనెల 7న బుధవారం ఉదయం 5 గంటల నుంచి 9వరకు ఆలయ అర్చకులచే అభిషేకములు, ధూప దీప నైవేద్యములతో అత్యంత వైభోపేతంగా ప్రత్యేక పూజలు,వివిధ కార్యక్రమాలు జరుగునని ఆలయ కమిటీ వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.