

జనం న్యూస్,మే03,జూలూరుపాడు:
జనఘణన తో పాటు కుల ఘణన చేయాలనీ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించటం పట్ల హార్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భరతమాత ముద్దుబిడ్డ ప్రధాని మోదీ చిత్ర పఠానికి బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ పాలాభిషేకం చేసినారు. ప్రధానమంత్రి మోడీకి కేంద్ర క్యాబినెట్ కి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కులగణన తప్పుల తడకగా కొన్ని ఇళ్లకు పోకుండానే సర్వే చేసినవాని గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేలు వల్ల కొన్ని కులాలు వారు నష్టపోయినారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జనగణ, కులగణ సర్వే సంపూర్ణంగా చెయ్యాలని కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసినారు, మోడీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ అభినందిస్తున్నారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, భూక్య రమేష్, ధారావత్ బాల కిషన్, నిమ్మటూరి రామారావు, భూక్య రమేష్, సిరుకురపు గోపాలరావు, నర్వనేని కృష్ణ, వందనపు సుబ్బు తదితరులు పాల్గొన్నారు.