

.జనం న్యూస్ ;4 ఏప్రిల్ ఆదివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్:
ఇందిరమ్మ కాలనీలో విద్యార్జనకు ఆలయం: నలంద మోడల్ విద్యాలయ ఔన్నత్యం ప్రిన్సిపాల్ హరినాథ్ నేతృత్వంలో విద్యా క్షేత్రంగా ఎదుగుతున్న ఆదర్శ పాఠశాల సిద్దిపేట్ జిల్లా లోని ఇందిరమ్మ కాలనీలో 20 మంది విద్యార్థులతో చిన్న స్థాయిలో ప్రారంభమైన నలంద మోడల్ విద్యాలయం, ఇప్పుడు 150 మంది విద్యార్థులతో విద్యారంగంలో శ్రేష్ఠతను సాధిస్తూ ముందుకు సాగుతోంది. “బాల్యం అమూల్యమైనది – విద్యార్జన అనంతమైనది” అనే నినాదంతో, ప్రిన్సిపాల్ శ్రీ హరినాథ్ సారథ్యంలో ఈ పాఠశాల, చిన్నారి బాలబాలికలకు ఇంటిని తలపించే మైమరిపించే వాతావరణంలో, స్నేహపూరిత విద్యను అందిస్తోంది.
విశిష్ట అనుభవం గల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రతి ఒక్క విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తూ నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది. బతుకమ్మ, దసరా, గణేశ్ ఉత్సవాలు వంటి పండుగల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు చక్కగా పరిచయం చేస్తోంది. ప్రతి పండుగకు సంబంధించిన మూల కథలు, విశేషాలు విద్యార్థులకు వివరించటం ద్వారా వారిలో లోతైన అవగాహన కల్పిస్తోంది. అంతేకాక, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ఒలింపియాడ్, అబాకస్, ఇంగ్లీషు లెర్నింగ్ వర్క్షాప్లు నిర్వహించడం ద్వారా విద్యార్థుల మెళకువలను పెంపొందిస్తోంది. నర్సరీ నుండి యూకేజీ వరకూ పిల్లలకు బొమ్మలతో, ప్లే కార్డ్స్తో బోధన కొనసాగిస్తూ వారి మేధో వికాసానికి దోహదం చేస్తోంది.
ప్రిన్సిపాల్ హరినాథ్ నాయకత్వంలో నలంద విద్యాలయం విశాల తరగతి గదులు, కంప్యూటర్, డిజిటల్ క్లాసులు కలిగిన సదుపాయాలతో, విద్యార్థులకు హల్లాదకర వాతావరణంలో శ్రేష్ఠ విద్యను అందిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతోంది.వివరాలకు8328161045 సంప్రదించగలరని తెలిపారు.