

, జనం న్యూస్ మే 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
కాట్రేనికోన మండలం ఆయోధ్య రాముడి కోసం తయారు చేసిన రాముడికి ప్రీతికరమైన దనస్సుకు ఆదివారం కుండలేశ్వరంలో శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోకాకళ్యాణార్ధం ఆయోధ్య రాముడి కోసం 13 కిలోల వెండి, ఒక కిలో బంగారంతో ఈ ధనుస్సు ను ప్రత్యేకం గా రూపొందించారు. తొలిత ఆలయానికి చేరుకున్న ధనస్సుకు దేవస్థానం ఈవో గంగాధర్ వెంకటేశ్వరరావు మరియు ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళ కూరి కామేశ్వరి శర్మ ఆధ్వర్యంలో గ్రామస్థులు, భక్తులు, మేళతాళాలతో మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. 14 ఏండ్ల వనవాసానికి ప్రతీకగా 14 కిలోల బరువుతో రూపొందించిన ఈ ధనస్సు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలలో భక్తుల దర్శనార్ధం యాత్రను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.స్వామి వారి మూలవిరాట్ వద్ద ధనుస్సుకు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కామేశ్వర శర్మ ధనస్సు కు ప్రత్యేక పూజలు జరిపారు. అయోధ్య రామ ధనస్సు కు పలు క్షేత్రాలలో ప్రత్యేక పూజలు జరిపి అయోధ్య రాముని చెంతకు చేర్చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
