Listen to this article

జనం న్యూస్,మే05, అచ్యుతాపురం:


మాజీ పిడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు, రూపొందించిన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం
స్టడీ మెటీరియల్ ను ఉపాధ్యాయ ఉద్యోగానికి నిర్వహించే పరీక్షకు(డీఎస్సీ) సిద్ధమవుతున్న విద్యార్థులకు
జన విజ్ఞాన వేదిక అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి వెంకట అప్పారావు ఉద్యోగార్డులకు అందజేశారు. అడిగిన వెంటనే వందకు పైగా పుస్తకాలను పంపిన ఎమ్మెల్సీ లక్ష్మణరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఉద్యోగార్డులు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి మంచి ఉపాధ్యాయునిగా పేరు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. మెటీరియల్ కావలసిన వాళ్లు 9494187980 నంబర్ కి ఫోన్ చేయవలసిందిగా కోరారు.