

జనం న్యూస్,మే 13,అచ్యుతాపురం:
దేశ శ్రేయస్సు కోసం,దేశానికి దైవ సంకల్పం తోడవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన మహా సంకల్పంతో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నాయకత్వంలో 100 మంది జన శ్రేణులతో కలసి తమిళనాడు లోని మధురైలో ఉన్న ప్రముఖమైన మధుర మీనాక్షి దేవాలయం, తిరుపురంకుండ్రమ్ అరుల్మీగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు,అర్చనలు,అభిషేకాలు,కల్యాణోత్శోవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ భారత దేశానికి అనుకోని పరిస్థితులో ఏర్పడిన ఆపరేషన్ సింధూర్ జరిగిందని, ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నేపథ్యంలో త్రివిధ దళాలకు,దేశ ప్రధాని మోడికి బలం చేకూరాలని,మన రాష్ట్రం,మన దేశం సస్యశ్యామలంగా ఉండాలని మరియు అలా ఉండేందుకు చేసిన ఈ ప్రత్యేక పూజలు ఫలించాలని అన్నారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ నాయకత్వంలో 1౦౦ మంది జన శ్రేణులతో దర్శించి దేశ సౌభాగ్యం మరియు స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొనడం కోసం పూజలు, అభిషేకాలు చేసే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరొక సారి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.