

జనం న్యూస్ మే 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మునగాల మండల పరిధిలోని తాడువాయి రెవెన్యూ శివారులో వాగులో మట్టి పోసి ఆక్రమణకు గురి చేస్తున్నారని వివిధ దిన పత్రికలలో ప్రచురితమైనందున మంగళవారం రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు పరిశీలన జరిపి రైతులతో మాట్లాడి మట్టిని తొలగించమని చెప్పటం తో రైతు నేను అట్టి మట్టిని తీసివేస్తా అని చెప్పడం జరిగినది.ఈ కార్యక్రమంలో డి ఈ ఆనంద్,రెవిన్ ఇన్స్పెక్టర్ రామారావు,ఏ ఇ లు శ్రీనివాస్ వినయ్ పాల్గొన్నారు.